సామాన్యులపై ప్రతాపం చూపించి పెద్దొళ్ల విషయంలో కేసులు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కించే పోలీసులను హడలెత్తిస్తున్నారు సింగ్నగర్, పాయకాపురం పరిసర ప్రాంతాల్లోని మాయలేడీలు. స్టేషన్కు ముందువెళ్ళి ఫిర్యాదు చేస్తే తమకే న్యాయం జరుగుతుందని పసిగట్టిన కొందరు మాయలేడీలు ఆ కోవలోనే బాణం విసురుతున్నారు. అమాయకులపై ఫిర్యాదు చేసి కేసు త్వరితగతిన నమోదు చేయకుంటే మానవ హక్కుల సంఘం, కమిషనర్ను ఆశ్రయిస్తానంటూ పోలీసులను బెదిరించడం వీరి స్టైల్. పాయకాపురం పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో ఏడాది క్రితం ఓ మాయలేడీ అద్దెకు దిగింది. అడ్వాన్స్ తప్ప ఇంటి యజమానికి ఒక్క నెల అద్దె కూడా చెల్లించలేదు. నెలనెల అద్దె సక్రమంగా కట్టాలని ఇంటి యజమాని ఆమెను పలుమార్లు కోరాడు. అయినా ఒక్క నెల అద్దెకూడా చెల్లించకపోగా తనను ఇళ్ళు ఖాళీ చేయమన ఇంటి యజమాని తీవ్రంగా వేధిస్తున్నాడని, కొంత మంది అనుచరులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు, తనపై దాడి చేసి ఇంట్లో విలువైన వస్తువులను ధ్వంసం చేసి, అపహరించుకుపోయారని శనివారం పాయకాపురం పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈమె గురిం చి మొత్తం తెలిసినప్పటికీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసునమోదు చేశారు.
విచారణలో ఇంటి యజమాని ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం. ఈమె పెట్టిన ఐదు కేసులు మాయ కేసులు అని గ్రహించిన పోలీసులు ఈ కేసు విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. అయితే ఈమెను హెచ్చరించకపోవడానికి ప్రధాన కారణం పోలీసు కమిషనర్ వద్దకు వెళ్ళి తమపై ఫిర్యాదు చేస్తుందన్న భయంతోనేనని తెలిసింది. ఇటువంటి మాయలేడీలకు ఈ ప్రాంతంలో కొదవలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో కొన్నాళ్ళు సహజీవనం చేయడం అడిగింది ఇవ్వకుంటే తమను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి బారిన పడి అనేక మంది అమాయకులు పోలీస్ మర్యాదలు రుచి చూస్తున్నారు.
వాంబేకాలనీ లో ఇదే పరిస్థితి నెలకొంది. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇళ్ళు అమ్ముకోకుంటే పిల్లలు పస్తు ఉండాల్సిందేనని ఇళ్ళు అమ్ముకున్న మాయలేడీ నేడు ఆ ఇంటికి అధిక ధర పలుకుతుండడంతో మధ్యవర్తిగా ఉన్న కూరగాయల వ్యాపారి, బీసీ నాయకుడుపై కేసు పెట్టింది. ఇంటి కాగితాలు తాకట్టు మాత్ర మే పెట్టానని అమ్మలేదని మధ్యవర్తిగా ఉన్న ఆయనపై కేసు పెట్టింది. దీంతో రెండు రోజులుగా పాయకాపురం పోలీస్స్టేషన్ చుట్టు ఆయన ప్రదక్షణలు చేస్తున్నాడు. ఇటువంటి మాయలేడీల విషయంలో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు పలువురు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more